చర్లలో టీఆర్ఎస్ వర్గీయుల కుమ్ములాట..

by Disha Web Desk 12 |
చర్లలో టీఆర్ఎస్ వర్గీయుల కుమ్ములాట..
X

దిశ, చర్ల : టీఆర్ఎస్ వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బుధవారం మధ్యాహ్నం చర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పరుచూరి రవికుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చర్ల వైద్యశాలకు తరలించి చికిత్స చేపిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో పరుచూరి రవికుమార్ కారు కూడా ధ్వంసం అయినట్లు సమాచారం.

Next Story

Most Viewed