- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Eatala Rajender: CM సొంత నియోజక వర్గం.. ఈటల సమక్షంలో BJPలో చేరిన TRS నాయకులు
దిశ కొండపాక: TRS Leaders Joined BJP From Gajwel Constituency In the Presence Of Eatala Rajender| సీఎం సొంత నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్ర ఓబీసీ సెల్ కల్చరల్ ఇన్చార్జ్ నందాల శ్రీనివాస్, మండలాధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో దాదాపు 30 మంది యువకులు బీజేపీలో చేరారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీజేపీనే అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొండపాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తుప్పుడు స్వామీ, బుద్ది భాస్కర్,వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుద్ధి సుధాకర్, చెన్న హరికృష్ణ, తుపాకుల అజయ్, బుద్ధి ప్రశాంత్, నల్ల మధు, వాసవి నితిన్, దొంతర బోయిన ప్రశాంత్, తోడేటి రాజు, చిలుక నాగరాజు, జికూరి శ్రీనివాస్, శ్రీరామ్ శ్రీకాంత్, బండి బాలకిషన్, మోర అశోక్, ఎర్రవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యారమైన మల్లేశం, బోనాల నవీన్, రుద్రారం నరేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొండపాక ఎస్సీ మోర్చా అధ్యక్షులు బర్రె కిషన్, నాయకులు బొద్దుల శ్రీకాంత్, నల్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కేంద్రం దెబ్బకు డిఫెన్స్లో కేసీఆర్ సర్కార్?