టీఆర్ఎస్ నాయకుడి చెరుకు తోట దగ్ధం.. వారి పనేనా.‌?

by Dishafeatures2 |
టీఆర్ఎస్ నాయకుడి చెరుకు తోట దగ్ధం.. వారి పనేనా.‌?
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తట్టు నారాయణ యాదవ్‌కు చెందిన 2.20 ఎకరాల చెరుకు తోట పూర్తిగా దగ్ధమైంది. అదేవిధంగా 1.20 ఎకరాల అల్లం చేలోని డ్రిప్ పరికరాలు, స్టార్టర్ బోర్డులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో మొత్తం 4 ఎకరాల డ్రిప్ పరికరాలు బుగ్గిపాలయ్యాయి. ఇందుకు కారణం తానంటే గిట్టని వ్యక్తుల పనేనని తట్టు నారాయణ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.3లక్షల వరకు ఆస్తి, రూ.2.5 లక్షల పంట కలిపి మొత్తం రూ.5.5 లక్షల నష్టం వాటిల్లిందని తట్టు నారాయణ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అనుమానితులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Next Story