సీసా కోసమే మెడలో గులాబీ కండువా వేసుకున్నా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: టీఆర్ఎస్ కార్యకర్త

by Dishanational1 |
సీసా కోసమే మెడలో గులాబీ కండువా వేసుకున్నా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: టీఆర్ఎస్ కార్యకర్త
X

దిశ, మణుగూరు: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఒక చోట టీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చి ఇంటికి వెళ్తున్న ఓ కార్యకర్తను ఏ ప్రభుత్వం వస్తుందని అడిగితే... ఆ పెద్ద మనిషి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని షాకింగ్ కామెంట్ చేశాడు. మరి 'నీ మెడలో టీఆర్ఎస్ కండువా ఎందుకు వేసుకున్నావ్' అని అడిగితే.. 'కోటర్ సీసా కోసం వేసుకున్నానని' జవాబు ఇచ్చాడు. కోటర్ సీసా కోసం తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదని వీడియో ద్వారా తెలిపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



Next Story

Most Viewed