జాబ్ నోటిఫికేషన్లతో గ్రామీణ విద్యార్థులకు చిక్కులు

by Disha Web Desk |
జాబ్ నోటిఫికేషన్లతో గ్రామీణ విద్యార్థులకు చిక్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలు బాగానే ఉన్నా, విద్యార్థులకు ప్రిపరేషన్​ విషయం సమస్యగా మారబోతుందని ఎంఎల్సీ వాణీదేవి పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు చిక్కులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవ్వాలని సిటీలకు వస్తుంటే ప్రైవేట్​ కోచింగ్​ సెంటర్లు భారీ స్థాయిలో ఫీజుల వసూలు​ చేస్తున్నాయన్నారు. వాటిని ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్​ లైబ్రరీలు, ఇంటర్నెట్​ కల్పించడంతో పాటు స్డడీ మెటిరీయల్స్​ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. తక్కువ ధరలకే స్టడీ మెటీరియల్స్​ లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దీని వలన విద్యార్థులపై ఆర్థిక భారం తప్పుతుందన్నారు.



Next Story

Most Viewed