తీవ్ర విషాదం.. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

జగిత్యాల పట్టణ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

తీవ్ర విషాదం.. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సాయిరాం నగర్‌కు చెందిన మెన్నేని ప్రణీత్ రావు(39) బైక్‌పై ప్రయాణిస్తుండగా జగిత్యాల బైపాస్ రోడ్డులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో నేలపై పడి తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై భార్య మెన్నేని అస్మిత ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story