‘బ్లాక్ డే’ రోజే మరో ప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-14 06:36:58  IST  )

బ్లాక్ డే(ఫిబ్రవరి 14) రోజే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ముగ్గురు జవాన్లు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

‘బ్లాక్ డే’ రోజే మరో ప్రమాదం.. ముగ్గురు జవాన్లు మృతి
X

దిశ, భద్రాచలం: 2019లో పుల్వామా ముష్కరుల దాడిలో జవాన్‌లను కోల్పోయిన తర్వాత, ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14ను దేశ ప్రజలు బ్లాక్ డేగా పాటిస్తున్నారు. అయితే, ఈ రోజు(ఫిబ్రవరి 14,2026) ఛత్తీస్‌గఢ్ దంతారి వద్ద 201 కోబ్రాకి చెందిన ముగ్గురు జవాన్లు ప్రమాదంలో మృతి చెందడం విషాదంగా మారింది. అద్దె కారులో నలుగురు జవాన్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒక సివిల్ ట్రక్ కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఉమేద్ సింగ్, రాజ్ కుమార్ గౌడ్, ముఖేష్ కుమార్ లు మృతి చెందగా, అభిమాన్ రే అనే జవాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

Next Story