మత్తడి పోచమ్మ ఆలయంలో చోరీ

by Jakkula.Mamatha |

రామారెడ్డి మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మత్తడి పోచమ్మ ఆలయంలో చోరీ
X

దిశ, సదాశివ నగర్(రామారెడ్డి): రామారెడ్డి మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగుడు ఆలయంలోని విలువైన బంగారు పుస్తెలు, మట్టెలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు రామారెడ్డి ఎస్సై టి.మురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి సంజీవ్‌గా గుర్తించినట్లు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ మురళి తెలిపారు.

Next Story