కాలువలో యువకుడు గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు

by Javid Pasha |
కాలువలో యువకుడు గల్లంతు.. గాలిస్తున్న పోలీసులు
X

దిశ, దేవరకొండ: హోలీ పండగ సందర్భంగా రిజర్వాయర్‌లో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు కాలువలో గల్లంతయ్యాడు. ఈ ఘటన పీఏ పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గల్లంతైన యువకుడు దేవరకొండ నియోజకవర్గ పరిధిలో కొండమల్లేపల్లి మండలంలోని చిన్న అడిసేర్ల పల్లి గ్రామానికి చెందిన మారేపల్లి మహేష్ (23 ) గా పోలీసులు గుర్తించారు. మహేష్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నానం చేసేందుకు పీఏ పల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్ళాడు. అక్కంపల్లి రిజర్వాయర్ నుండి హైదరాబాద్ త్రాగు నీటి కోసం వెళ్లే కాలువలో స్నానం చేసేందుకు స్నేహితులతో కలిసి దూకాడు.

రిజర్వాయర్ పై భాగంలో రెండు గేట్లు తెరిచి ఉండడంతో నీటి ప్రవాహం ఎక్కువ రావడంతో మహేష్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఇప్పటివరకు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ ఐ . వీరబాబు తెలిపారు. చీకటి పడడంతో రేపు గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఆయన తెలిపారు. మహేష్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed