కోళ్లఫామ్​లో భర్తను చూసేందుకు వెళ్లిన భార్య తెల్లారేసరికి మృతి

by Disha Web Desk |
కోళ్లఫామ్​లో భర్తను చూసేందుకు వెళ్లిన భార్య తెల్లారేసరికి మృతి
X

దిశ,మల్లాపూర్: కుటుంబాన్ని వదిలి బతుకుదెరువు కోసం వెళ్లిన భర్తను చూసేందుకు వచ్చిన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటికే అప్పుల ఊబిలో మునిగి అష్టకష్టాలు పడుతున్న భర్తను.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను ఒంటరి వాళ్లను చేసి ప్రాణాలు వదిలింది ఆ ఇల్లాలు. మల్లాపూర్ల్ మండలంలో జరిగిన ఈ విషాద ఘటన రెండు గ్రామాలను శోకసంద్రంలోకి నెట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

మొగిలిపేట గ్రామానికి చెందిన కొమిరే శ్రీను కోళ్ల ఫామ్​ను దండవేని సోమరాజు లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. ఆ కోళ్ల ఫామ్​లో పనిచేయడానికి కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాజు కుదిరాడు. నెల రోజులుగా అక్కడే ఉంటూ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజు భార్య నాగలక్ష్మి (25) భర్తను చూసేందుకు తమ ఇద్దరు పిల్లలు నిత్య (04) నితిన్(01)లను తీసుకుని కోళ్ల ఫారానికి వచ్చింది. రాత్రి అందరూ కలిసి పడుకోగా.. ఉదయం ఆమె పక్కబట్టలు తీస్తుండగా విద్యుత్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కోళ్ల ఫామ్​లోని విద్యుత్​ వైర్లను ఎలకలు కొట్టడంతో తీగలు బయటకు తేలి ఇంట్లోని వస్తువులకు విద్యుత్​ ప్రసారం అయింది. క్రమంలో వాటిని నాగలక్ష్మి పట్టుకోవడంతో షాక్​కు గురై ప్రాణాలు కోల్పోయింది. భర్తను చూసి వెళదామని వచ్చిన భార్య విఘాత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed