సంచలనం: భువనగిరిలో పరువు హత్య కలకలం

by Disha Web Desk 2 |
సంచలనం: భువనగిరిలో పరువు హత్య కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి.. అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ అనే యువకుడు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి పక్కా ప్లాన్‌తో హత్య చేయించాడు. రెండ్రోజుల క్రితమే రామకృష్ణను ట్రాప్ చేసి, మాయ మాటలు పెట్టి హైదరాబాద్‌కు పిలిపించారు. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృతదేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు. హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ గుప్త నిధుల కేసులో విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.



Next Story

Most Viewed