ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 12 |
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం
X

దిశ, దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మరణించిన సంఘటన దుమ్ముగూడెం మండలం సమీపంలోని చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా, కిష్టారం లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన దినం కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కిష్టారం పక్క గ్రామం పైతుల కుంట గ్రామానికి చెందిన తమా ఐతి అనే మహిళ, వెల్కన గూడెం కు చెందిన పాయం ముత్తయ్య మృతి చెందారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ తొట్టిలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి.


Next Story

Most Viewed