శ్రీ రామనవమి నాడు మాంసం అమ్మకం నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం

by Disha Web Desk 12 |
శ్రీ రామనవమి నాడు మాంసం అమ్మకం నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 10 శ్రీ రామ నవమి సందర్భంగా మాంసం అమ్మకాలు నిషేధిస్తూ.. బెంగళూరు పౌర సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరులో ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక రోజుల్లో మాంసం అమ్మడం, జంతువులను వధించడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఇలాంటి నిషేధాలు దాదాపు ఏడాదికి ఎనిమిది రోజులు విధించబడతాయని చెప్పుకొచ్చారు. అవి గాంధీ జయంతి, సర్వోదయ దినోత్సవం, కార్యక్రమాల వంటివి అని పేర్కొన్నారు. ఈ నిషేధం పై అందరూ స్వచ్చందంగా మద్దతు తెలపాలని కోరారు. అలాగే ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని పౌర సరఫరాల అధికారి తెలిపారు.

Next Story