బావ అలా చేయడం లేదని పురుషాంగాన్ని కొరికేసిన తమ్ముడి భార్య

by Disha Web Desk |
బావ అలా చేయడం లేదని పురుషాంగాన్ని కొరికేసిన తమ్ముడి భార్య
X

దిశ, వెబ్‌డెస్క్ : వెయ్యి ఊహాలు, ఆశలతో యువకుడిని పెళ్లాడిన ఆమె స్వప్నలు ఏడాదికే చెదిరిపోయాయి. భర్తతో అచ్చటా.. ముచ్చటా తీరకముందే తన కోరికలు మొడుబార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే బావ దగ్గరై.. ఆమెకు అన్నీ తానయ్యాడు. ఆ తర్వాత అతడి ప్రేమ కూడా దూరం అవుతుందని భావించిన ఆ యువతి.. బావ మరొకరికి దక్కకూడదని ఘోరానికి పాల్పడింది. బావ మర్మాంగాన్ని కొరికేసి.. తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

కాన్సూర్ జిల్లాలోని బిల్హౌర్ గ్రామానికి చెందిన విమల్‌కు సమీప గ్రామానికి చెందిన రాధతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత చిలుకా గోరెంకల కలిసి కాపురం చేసింది ఆ జంట. అయితే రాధ అత్తారింట అడుగు పెట్టిన ఏడాదికే భర్త విమల్‌లో మానసిక పరమైన సమస్యలు తలెత్తాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగి భర్తను ఆరోగ్యవంతుడిని చేయాలనుకున్నా.. అతడి ఆరోగ్యం బాగు కాలేదు. ఈక్రమంలో మరదలిపై కన్నేసిన బావ.. ఆమెను లోబర్చకున్నారు. ఇలా రెండేళ్లుగా ఇద్దరు భార్యభర్తల్లా.. భర్త, అత్తామామల ఎదురుగానే తిరిగారు.

వీరి అక్రమ సంబంధం గురించి బంధు, మిత్రుల్లో తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. కాగా, ఇటీవల కాలం నుంచి మరదలిని బావ పట్టించుకోకుండా తిరగడం ప్రారంభించాడు. రోజురోజుకు ఆమెను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాడు. ఇదే విషయంపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఏకాంతంగా గడిపిన సమయంలో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఉన్న మరదలు.. బావ పురుషాంగాన్ని పళ్లతో కొరికేసింది. ఆ తర్వాత తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. బెడ్ రూంలో అపస్మారక స్థితిలో పడిపోయిన ఇద్దరిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విమల్ సోదరుడి మర్మంగాన్ని అతికించడానికి వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story