భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మూవీ యూనిట్ సందడి.. సక్సెస్ కావలంటూ..

by Disha Web Desk 19 |
భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మూవీ యూనిట్ సందడి.. సక్సెస్ కావలంటూ..
X

దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్​శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని 'ద కశ్మీర్​ఫైల్స్'​ మూవీ చిత్ర యూనిట్​బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్​ వివేక్ రాజన్​అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్​అగర్వాల్, నటుడు దర్శన్​కుమార్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న 'ద కశ్మీర్​ఫైల్స్'​ మూవీ విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సినిమా ప్రారంభం కూడా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే ప్రారంభమయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్​వివేక్​రాజన్​అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్​అగర్వాల్, నటుడు దర్శన్​కుమార్‌లను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Next Story

Most Viewed