ఆయుర్వేద వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. ప్రతి జిల్లాలో ఆయుష్ హాస్పిటళ్లు

by Disha Web |
ఆయుర్వేద వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. ప్రతి జిల్లాలో ఆయుష్ హాస్పిటళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ఈ మేరకు ప్రతి జిల్లాలో ఆయూష్​ హాస్పిటళ్లను ఏర్పాటు చేయనున్నది. జిల్లా కేంద్రంలో తొలి విడత 20 బెడ్లతో సిద్ధం చేయాలని ప్రణాళికలు తయారు చేసింది. దీనిలో అన్ని విభాగాల వైద్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. పేషెంట్ల స్పందన బట్టి రాబోయే రోజుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని సర్కార్​ భావిస్తున్నది. దీంతో పాటు మండల కేంద్రాల్లో 421 ఆయూష్​ వెల్​నెస్​ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. నేషనల్​ హెల్త్​మిషన్​ స్కీంలో వీటి నిర్వహణ, పర్యవేక్షణలు కొనసాగనున్నాయి.


Next Story

Most Viewed