- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పసుపుతోటలో కూలి పనికి వెళ్లిన హైబ్రిడ్ పిల్లా... పిక్స్ వైరల్

దిశ, సినిమా: సహజ నటనతో అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. 'భానుమతి.. హైబ్రిడ్ పిల్లా.. ఒక్కటే పీస్' అంటూ 'ఫిదా' చిత్రంలో ఆమె చూపిన అభినయాన్ని తెలుగు ప్రేక్షకులెవరూ మరిచిపోలేరు. ఇక తరచూ సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే నటి.. తాజాగా పొలంలో కూలిగా మారిపోయి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా పనిలో నిమగ్నమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సాయి పల్లవి.. 'పాతుకుపోయిన వాటిని పెకిలించుట' అనే క్యాప్షన్ జోడించింది.
ఫొటో విషయానికొస్తే పసుపు తోటలో కూలీల మధ్య తలకు టవల్ చుట్టుకుని కనిపిస్తున్న ప్రేమమ్ బ్యూటీ.. వారితో కలిసి చాలాసేపు పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె చుట్టూఉన్న మహిళల ముఖాలు ఆనందంతో వెలిగిపోతుండటం చూడొచ్చు. ఇక ఇదే ఫొటోకు అనుపమ పరమేశ్వరన్ 'హార్ట్ సింబల్'తో రిప్లయ్ ఇవ్వగా.. 'నీలాంటి వారు ఎవ్వరూ లేరు' అంటూ శ్రద్ధా శ్రీనాధ్ సాయి పల్లవిని ప్రశంసించింది.