కుతురుపై వ్యక్తి దారుణం.. చివరికి బాధితురాలి తల్లిని కూడా వదలని నిందితుడి ఫ్యామిలీ

by Disha Web |
కుతురుపై వ్యక్తి దారుణం.. చివరికి బాధితురాలి తల్లిని కూడా వదలని నిందితుడి ఫ్యామిలీ
X

దిశ, అచ్చంపేట : చెంచు మహిళపై విచక్షణ రహితంగా కర్రలతో కొందరు మైనార్టీ మహిళలు ఆదివారం రాత్రి దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మల్లాపూర్ పెంటకు చెందిన ముత్తమ్మ తన కూతురుతో కలిసి గత కొంత కాలంగా మన్ననూర్ గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. తన కూతురును మన్ననూరు గ్రామానికి చెందిన సల్మాన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని, అతనికి వివాహమైందని, భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపింది.

నా కూతురుకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని తెలిపింది. అయితే నా కూతురుని తీసుకెళ్లిన.. సల్మాన్ భార్య, అతని తల్లి, మరో మహిళ ముగ్గురు కలిసి ఆదివారం నీ కూతురు ఎక్కడ ఉందో చెప్పు..? అంటూ నానా బూతులు తిడుతూ కర్రలతో దాడి చేయడంతో పాటు ఒంటిపై బట్టలు ఊడదీసి పశువును బాదినట్లు బాదారని, చంపే ప్రయత్నం చేశారని వాపోయింది. వారు కొడుతున్న దెబ్బలకు తాళలేక ప్రాణభీతితో పరుగులు తీసి రోడ్డుపైకి పరిగెత్తానని బాధితురాలు తెలిపింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు వారిని బెదిరించడంతో వెళ్లిపోయారని రోదిస్తూ.. నాకు న్యాయం చేయండి సార్ అంటూ వేడుకొంది. ఈ ఘటనపై ఆదివాసీ సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితురాలు తెలిపింది.



Next Story

Most Viewed