కుటుంబ సభ్యులకు షాక్.. చనిపోయిన 24 గంటలకే తిరిగి వచ్చాడు

by Dishanational2 |
కుటుంబ సభ్యులకు షాక్.. చనిపోయిన 24 గంటలకే తిరిగి వచ్చాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కొంత మంది భయపడిపోతే, మరికొంత మంది షాకై ఆనందంలో మునిగి తేలిపోతుంటారు. అయితే ఇలానే చనిపోయిన వ్యక్తిని ఖననం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి కుటుంబసభ్యులకు షాకిచ్చిన ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. చెరుకు కోయడానికి వెళ్లిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కొడుకులు బాధపడుతున్న సమయంలో వాళ్ల నాన్న నేను ఉన్నానంటూ.. ఇంటికి వచ్చి కొండత బలాన్ని ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్లి తే.. రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలోని బనగలద్‌పూర్‌‌కు చెందిన మూర్తి(51) అనే వ్యక్తి రోజూ వారి కూలి పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే పనిలో భాగంగా ఆయన గత కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అక్కడే పనిచేసుకుంటున్న సమయంలో తన కూమరుడికి పోలీసులు ఫొన్ చేసి మృత దేహానికి సంబంధించిన విషయం గురించి తెలిపారు. దీంతో కుమారుడు కార్తీక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించి, అది తన తండ్రి శవంగా గుర్తించి పోలీసులకు తెలిపారు. దీంతో తన తండ్రి చనిపోయాడని, కుటుంబ సభ్యులకు తెలిపి, అంత్యక్రియలు నిర్వహించారు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంటి పెద్ద చనిపోయాడని బాధపడుతున్న వారి కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం వెళ్లి వెరిసింది. ఖననం చేసిన 24 గంటల్లోనే చనిపోయాడనకున్న వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.


Next Story

Most Viewed