బిగ్ బ్రేకింగ్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

by Disha Web Desk 2 |
బిగ్ బ్రేకింగ్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడుశాతం డీఏ పెంచాలని నిర్ణయం తీసుకుంది. 31 నుంచి 34 శాతానికి పెంచుతూ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డీఏ పెంపు జనవరి 1, 2022 నుంచి అమలులోకి రానుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపుదల జరిగింది. "డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి కారణంగా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ. 9,544.50 కోట్లుగా ఉంటుంది. దీని వల్ల దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు" అని ప్రకటన పేర్కొంది. డీఏ పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed