- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం ఉక్కుపాదం.. ఇవాళ ఒక్కరోజే 242 సైట్లు బ్లాక్
దేశాన్ని బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. అక్రమంగా కొనసాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్వర్క్లను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ఉధృతం చేసింది.

దిశ వెబ్డెస్క్: దేశాన్ని బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. అక్రమంగా కొనసాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్వర్క్లను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం (Government Of India) చర్యలను మరింత ఉధృతం చేసింది. యువతను తప్పుదోవ పట్టిస్తూ, ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్న వెబ్సైట్లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా కొరఢా ఝళిపించింది. ఇవాళ ఒక్కరోజే కేంద్రం 242 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లతో పాటు వాటి అనుబంధ లింకులను కూడా బ్లాక్ చేసింది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 7,800 నుంచి 8 వేల వరకు అక్రమ గేమింగ్ ప్లాట్ఫామ్లను నిలిపివేశారు. అక్టోబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిన ‘ఆన్లైన్ గేమింగ్ చట్టం’ (Online Gaming Act) ప్రకారం తాజాగా మరో 242 వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ చర్యలకు ఉపక్రమించారు.
కాగా, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఈజీ మనీ (Easy Money) ఆశ చూపిస్తూ వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. సదరు వెబ్సైటలు అన్ని విదేశాల నుంచి నిర్వహిస్తుండగా.. వాటి ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి రాకుండా విదేశాలకు తరలిపోతోంది. బెట్టింగ్లో డబ్బు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంతో బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.






