ఏ తల్లి కన్న బిడ్డో.. చెత్తకుప్పలో శవమైంది

by Dishanational2 |
ఏ తల్లి కన్న బిడ్డో.. చెత్తకుప్పలో శవమైంది
X

దిశ,లక్ష్మీదేవి పల్లి : మానవత్వం మంట కలిసింది అనడానికి మరో ఉదాహరణ దొరికింది. కన్న తల్లే కసాయిలా మారి పసికందును వీధిపాలు చేసింది. సమాజానికి భయ పడిందో,బిడ్డ భారం అనుకుందో తెలియదు కానీ పురిటి మరకలు చదర కుండానే చెత్తకుప్ప పాలు చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలం‌లోని ముర్రేడువాగు సమీపంలోనీ శ్రీనగర్ కాలనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పసికందుని వదిలేసి వెళ్లారు. అక్కడి ప్రాంత వాసులు చిన్నారి మృతదేహాన్ని చూసి లక్ష్మీదేవి పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed