Telangana News: టెట్​ టెన్షన్..​ ఎగ్జామ్​సెంటర్లు క్లోజ్..ఆందోళనలో అభ్యర్థులు​

by Disha Web Desk 12 |
Telangana News: టెట్​ టెన్షన్..​ ఎగ్జామ్​సెంటర్లు క్లోజ్..ఆందోళనలో అభ్యర్థులు​
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్​ టెట్​–2022 అప్లికేషన్ల గడువుకు ముందే ఎగ్జామ్​ సెంటర్లను ఎత్తి వేశారు. కొత్త జిల్లాల ప్రకారం ముందుగా 33 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ, అనుకున్నదానికంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దీంతో పలు జిల్లాల్లో టెట్​ సెంటర్లు ఎత్తివేశారు. దాదాపుగా మూడు రోజుల కిందటి నుంచే ఈ సెంటర్లను బ్లాక్​లో పెట్టారు. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి సొంత జిల్లా సెంటర్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పక్క జిల్లాలో సెంటర్​ పెట్టుకుంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం శనివారం సాయంత్రం వరకు టెట్​ అప్లికేషన్లు 4 లక్షలు దాటాయి.

ఏడు జిల్లాల్లో ఆల్రెడీ బ్లాక్​..

అప్లికేషన్లు అత్యధికంగా రావడంతో ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిజామాబాద్​, వికారాబాద్​, హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల సెంటర్లను టెట్​ వెబ్​సైట్​లో క్లోజ్​ చేశారు. ఈ జిల్లాలకు చెందిన ఇంకా మిగిలిన అభ్యర్థులు మరో జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం మినహా గత్యంతరము లేదని అధికారులు వెల్లడించారు. టెట్​ అప్లికేషన్​ ఫీజు చెల్లించేందుకు నేటితో (సోమవారం) ఆఖరి గడువు. మంగళవారం టెట్​ అప్లికేషన్​ సబ్మిషన్​ క్లోజ్​ అవుతుంది.

ఇంకా దాదాపు లక్షన్నర వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలతో టెట్​ అప్లికేషన్లు చేసుకోవడం లేదు. దీంతో గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు గడువు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చివరి నిమిషంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

నేడు మరిన్ని జిల్లాలు క్లోజ్​

టెట్​ అప్లికేషన్ల సామర్థ్యం మించుతుండటంతో.. దరఖాస్తుదారులకు చిక్కులు వస్తున్నాయి. తాజాగా సోమవారం నుంచి ములుగు, జగిత్యాల జిల్లాలను సైతం అధికారులు క్లోజ్​ చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్​ ఉంది. ఒకవేళ అప్లికేషన్ల గడువు పెంచితే మాత్రం కేవలం నాలుగైదు జిల్లాలకే అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story

Most Viewed