ధాన్యం కొనుగొల్లపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ దంగ‌ల్

by Disha Web Desk 12 |
ధాన్యం కొనుగొల్లపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ దంగ‌ల్
X

దిశ, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోళ్లపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం సాగిస్తునే ఉన్నారు. లోక్ సభలో పట్టువదలకుండా ధాన్యం సేకరణ పై స్పీకర్ ఓం బిర్లా కు ఎంపీ నామా నాగేశ్వర్ రావ్ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో రైతుల కష్టాలు పడుతున్న విషయంపై చర్చ చేయాలని అభ్యర్థించారు.

అలాగే దేశంలో ఆహార ధాన్యాల సేకరణ పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే రైతుల భవిత్యం ఆధారపడి ఉన్న అతి ముఖ్యమైన ఈ విషయంపై లోక్ సభలో కచ్చితంగా చర్చించాలని తెలంగాణ ఎంపీ లు స్పీకర్ ఓం బిర్లా ను కోరారు.


Next Story

Most Viewed