అలా వచ్చిందని బాలికను చావబాదిన టీచర్..

by Dishafeatures2 |
అలా వచ్చిందని బాలికను చావబాదిన టీచర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరోసారి మత ఘర్షణలు ఏర్పడుతున్నాయి. ఒకచోట సమస్యకు పరిష్కారం వచ్చేలోపు మరో చోటు ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వేరే మతాల వారికి కించపరిచే విధంగా ఉన్న కొందరి ప్రవర్తన కారణంగా ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణలు జరిగేందుకు దారి తీస్తున్నాయి. దాంతో ప్రభుత్వం ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకుంటూ సమస్యను అక్కడిక్కడే తొక్కి పెడుతోంది. ఇటువంటి ఘటనే తాజాగా జమ్మూ కశ్మీర్ రాజోరిలో చోటు చేసుకుంది. పాఠశాలకు తిలకం (బొట్టు) పెట్టుకొచ్చిన కారణంగా బాలికను ఓ టీచర్ చావబాదాడు. అంతేకాకుండా అమ్మాయిని తీవ్రంగా ధూషించాడని అధికారులు తెలిపారు.

పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న నిసార్ అహ్మద్ బాలికను కొట్టినట్లు వారు తెలిపారు. 'స్కూల్‌కు బొట్టు పెట్టుకొచ్చిన కారణంగా మైనర్ బాలికను అహ్మద్ తీవ్రంగా కొట్టాడని, దూర్భాషలాడాడని మాకు ఫిర్యాదు వచ్చింది' అని అధికారులు తెలిపారు. ఈ విషయంపై బాలిక తండ్రి స్పందిస్తూ.. ఇలానే జరిగితే ఇరు వర్గాల వాళ్లం తలలు పగలకొట్టుకోవాల్సి వస్తుంది అన్నారు. అయితే ఫిర్యాదు అందిన తక్షణం టీచర్‌ను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పారు.


Next Story

Most Viewed