AP News: నీకు దమ్ముంటే ఏం పీక్కుంటావో పీక్కో.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web |
AP News: నీకు దమ్ముంటే ఏం పీక్కుంటావో పీక్కో.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు ఏ2 విజయసాయిరెడ్డి శనిలా దాపురించాడు అని ఆరోపించారు. ఎవరన్నా పేరు తర్వాత బిఏ, ఎంఏ అని పెట్టుకుంటారు కానీ విజయసాయిరెడ్డి పేరు తర్వాత ఏ2 అని పేరుపెట్టుకున్న నేత అని విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో భూములు ఎక్కడ ఉంటే అక్కడ డేగలా వాలి ఆ భూములను దోచేసిన భూ బకాసురుడు విజయసాయిరెడ్డి. దాదాపు రూ.15,00కోట్లు విలువైన ఎంపీసీ భూములను రూ.200కోట్లకు బెదిరించి లాక్కున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అని ధ్వజమెత్తారు. తానేదో సత్యవంతుడికి తమ్ముడిలాగా, సత్యహరిశ్చంద్రుడికి అన్నలా మాట్లాడుతున్నాడంటూ ధ్వజమెత్తారు.

మధురవాడలో భూములు నీ తాత జాగీరా?

'వైసీపీలో తానే రాజు, తానే మంత్రిలాగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా డమ్మీని చేసి, ఉత్తరాంధ్రకు తానే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఖాళీ భూములు కనిపిస్తే చాలు భూకబ్జాలకు పాల్పడుతున్నాడు, భూదందాలు అంతే లేకుండా చేస్తున్నాడు. భూ బకాసురుడంటే గతంలో కథల్లో విన్నాం కానీ నేడు విజయసాయిరెడ్డి రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. విశాఖలో చిన్నపిల్లవాడిని అడిగినా విజయసాయి భూకబ్జాల గురించి, అక్రమ వసూళ్లు, దందాల గురించి చెబుతారు. విజయసాయిరెడ్డి భూ కబ్జాలు, దందాలను చూసే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రెచ్చిపోయి ఏకంగా ఇంటెలిజెన్స్ ఎస్పీ స్థలాన్నే కొట్టేసేందుకు ప్రయత్నించాడు' అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 16నెలలు జైల్లో ఉంటే తలదించుకు బతుకుతాడు ఎవరైనా..? నువ్వేమిటి..? భయం భక్తి లేకుండా, సిగ్గుశరం లేకుండా, చీము నెత్తురు లేకుండా ఇంత బరితెగింపా..? విశాఖలో వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ఏ వర్గాన్ని వదలకుండా నిలువు దోపిడీకి విజయసాయిరెడ్డి తెగబడ్డాడు. నీకు మధురవాడలో భూములు ఎక్కడనుంచి వచ్చాయి..? అదేమైనా నీ తాత జాగీరా..? వారసత్వంగా నీకు రావడానికి..? ఉత్తరాంధ్ర మీ బాబు జాగీరా..? అందరూ అన్నం కూరలు తింటారు.. విజయసాయి రెడ్డి తినేది డబ్బులు, స్థలాలే. ఏమార్గంలో అవినీతికి పాల్పడాలి, అక్రమాలు చేయాలి, సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలి, నీకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు. గౌరవప్రదమైన రాజ్యసభ సభ్యత్వ పదవికే మచ్చ తెచ్చావు అంటూ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాపై కేసులు పెట్టడానికి నీవేమైనా సత్యహరిశ్చంద్రుడివా

విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించినప్పటికీ ఉత్తరాంధ్ర భూముల విలువ పెరగకపోవడానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూదందానే కారణం. కరోనాలో రాష్ట్రం అంతా ''జె ట్యాక్స్'' వేస్తే, అక్కడ మాత్రం ''వీజె టాక్స్''.. డబుల్ దోపిడీ. తాడేపల్లి అకౌంట్‌లోకి వెళ్లేది తాడేపల్లికి, తన సొంత అకౌంట్‌లోకి వెళ్లేది తన ఖాతాలోకి. వీళ్లిద్దరి పేరు చెబితేనే రాష్ట్రం వణికిపోతోంది. వీళ్ల పాపాలు ఎప్పుడు పండుతాయో..? నీకు దమ్ముంటే, నువ్వేదైనా పీకగలిగితే, పీకు. ఇవాళ రేపు హైదరాబాద్‌లో ఉంటా.. ఎల్లుండి విజయవాడలో ఉంటా.. నువ్వు దోచుకున్న చిట్టా అంతా బైటపెడతా, నువ్వేమైనా పీకుతావా.. నీ అవినీతి గురించి మేము బైటపెడితే మామీద కేసులా..? నీ అవినీతి గురించి మీడియా చూపిస్తే వాళ్ల మీద కేసులా..? మా మీద కేసులు పెట్టించడం విజయసాయిరెడ్డి బరితెగింపునకు నిదర్శనం. నువ్వేదో సత్యవంతుడిలాగా, సత్యహరిశ్చంద్రుడిలా మామీద కేసులు పెట్టడానికి సిగ్గుండాలి. ప్రజల సొమ్ముతో పోలీసులు జీతాలు తీసుకుంటున్నారు. నువ్వు చెప్పినవాళ్ల మీదల్లా కేసులు పెట్టడానికి, వాళ్లకు నువ్వేమైనా జీతాలిస్తున్నావా..? అని ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.

అవినీతి బాగోతం చిట్టా విప్పుతా

విశాఖ జగదాంబ సెంటర్ లో ఏప్రిల్ 21న బహిరంగ చర్చ పెడదాం మీడియా సమక్షంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో దేహశుద్ధి ఖాయం. ఈసారి 12కాదు 1250కేసులు పెట్టాల్సివస్తుంది నువ్వు చేసిన పాపాలకి'' అని బుద్దా వెంకన్న హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో నీ అవినీతి బాగోతం, అక్రమ వసూళ్లు, భూదందాలు, భూకబ్జాలు, బినామీ లావాదేవీల గురించి పూర్తి సాక్ష్యాధారాలతో వస్తా, సర్వే నెంబర్లతో సహా బైటపెడతా.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా.. ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నావో, ఎవరెవరి స్థలాలు కబ్జా చేశావో ఆధారాలతో సహా చూపిస్తా.. నీ బినామీల పేర్లు కూడా బైటపెడతా, నువ్వు కబ్జా చేసిన స్థలాలు మీడియాకు చూపిస్తా అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.

Next Story

Most Viewed