HYD: చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన బీజేవైఎం జాతీయ నాయకుడు

by Disha Web Desk 2 |
HYD: చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన బీజేవైఎం జాతీయ నాయకుడు
X

దిశ, శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్‌లో ప్రజా ప్రతినిధులు ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఎల్లమ్మబండ ప్రాంతం డంపింగ్ యార్డుగా తయారయ్యిందని బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం ఆల్విన్ కాలనీ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లుపట్టి కాలనీల్లో శుభ్రం చేశారు. అనంతరం కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల్ని మోసం చేసే ముఖ్యమంత్రికి పాలభిషేకాలు చేయడం కాదు, ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆరోగ్యాలపై శ్రద్ధ పెట్టాలని హితవుపలికారు. పీజేఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్, కేటీఆర్ నగర్, జయశంకర్ కాలనీల్లో ఇండ్ల చుట్టూ చెత్త పేరుకుపోయి దోమలు, ఈగలు పెరిగిపోయి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. అధికారులు మొద్దు నిద్ర మాని ఆఫీస్‌లలో కూర్చోకుండా ఫీల్డ్ మీద తిరిగి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మణిభూషన్, రామచంద్రుడు, మధు, ప్రవీణ్, అనిత, రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed