- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత. గాంధీ విగ్రహం వద్ద నివాళులు. రాహుల్ గాంధీ ప్రసంగాలకు అడ్డు తగలవద్దని స్పీకర్కు చామల విజ్ఞప్తి.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొదటి విడతలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విదించిన విషయం తెలిసిందే. అయితే వారిపై ఉన్న సస్పెన్షన్ను లోక్సభ మంగళవారం (మార్చి 17, 2026) రద్దు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే తమ ధ్యేయమని చాటారు.
మీడియాతో మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా చేసిన సూచనలను ప్రస్తావించారు. సభలోకి ప్లకార్డులు తేవద్దని, వెల్లోకి రాకూడదని స్పీకర్ కోరారని, సభా మర్యాదలను తాము గౌరవిస్తామని తెలిపారు. అయితే, సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి స్పీకర్ తగిన అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నుండి అడ్డంకులు కలగకుండా, ఆయన మైక్రోఫోన్ కట్ చేయకుండా స్పీకర్ తటస్థంగా వ్యవహరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీల హక్కులను కాపాడుతూనే, ప్రజల గొంతుకను సభలో వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.






