ముంబై ఇండియన్స్‌కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

by Disha Web Desk 17 |
ముంబై ఇండియన్స్‌కు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
X

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాకముందే ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగిలింది. మార్చి 27న ముంబైలోని బ్రబోర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగే తొలి టీ20కి సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడు. బొటన వేలి గాయం నుంచి యాదవ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో అతను తొలి టీ20 అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత నెల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా 31ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ చేతి బొటన వేలుకు ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు చికిత్స అందించారు.ఈ నేపథ్యంలో అతను శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, రెండో మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వస్తాడని ముంబై ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తం చేసింది.




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed