- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'పుష్ప' మూవీ.. చిన్న లాజిక్ మిస్ అయిన సుకుమార్
దిశ, సినిమా: డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' మూవీ స్టోరీ దగ్గరి నుంచి క్యారెక్టర్స్ వరకు రియలిస్టిక్గా చూపించిన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల డ్రెస్సింగ్, మేకోవర్పై స్పెషల్గా కాన్సంట్రేట్ చేసిన సుక్కు.. ప్రత్యేకించి చిత్తూరు యాస విషయంలో ఎక్కడా మిస్టేక్స్ దొర్లకుండా చూసుకున్నాడు. ఇక అన్నింటికన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చింది మాత్రం ఎర్ర చందనం దుంగలను నీటిలో పడేసి వాటిని డ్యామ్ దగ్గర ఆపేసిన సీన్కే. కానీ ఇప్పుడు ఇదే సీన్ బేస్ చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు వీక్షకులు. విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో బరువైన ఎర్రచందనం దుంగ నీటిలో మునిగిపోయినట్లు చూపించారు. ఈ సినిమాలో స్మగ్లర్లు తమ సరుకును నీటి కింద దాచిన సన్నివేశాన్ని నెటిజన్లు పాయింట్ అవుట్ చేస్తున్నారు. వాస్తవానికి దుంగల రకాల్లో ఎర్ర చందనం మాత్రమే నీటిపై తేలదు. కాబట్టి 'పుష్ప' మేకింగ్లో సుకుమార్ ఈ లాజిక్ మిస్సయ్యాడని కామెంట్ చేస్తున్నారు.