ఎల్టీ కాలేజిలో అక్షయ పాత్ర మధ్యహ్న భోజన కిచెన్‌ను ప్రారంభించిన: ప్రధాని మోడీ

by Dishanational1 |
ఎల్టీ కాలేజిలో అక్షయ పాత్ర మధ్యహ్న భోజన కిచెన్‌ను ప్రారంభించిన: ప్రధాని  మోడీ
X

వారణాసి: వంద కాదు, వెయ్యి కాదు ఏకంగా లక్షమంది సరిపడా వంట చేసే కిచెన్‌ను ప్రధాని ప్రారంభించారు. గురువారం వారణాసి ఎల్టీ కాలేజిలో అక్షయ పాత్ర మధ్యహ్న భోజన కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. ప్రధాని మోడీ ముందు సంస్కృత పద్యాలు చదివి వినిపించారు. విద్యార్థుల్లో ఒకరు ప్రధానిపై పద్యాన్ని పఠించగా, మరొకరు ప్రధాని మోదీ కోసం డోలు వాయించారు. చివర్లో డ్యాన్స్ స్కిట్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూళ్లలో వసతులు, మధ్యాహ్న భోజనం సదుపాయం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని ఎల్‌టి కళాశాల వంటగదిని కూడా సందర్శించారు, నిమిషాల్లో వేలాది మంది విద్యార్థులకు ఆహారాన్ని తయారు చేయగల యంత్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ కిచెన్ నుంచి ఎంపిక చేసిన స్కూళ్లకు మధ్యాహ్న భోజనం పంపించనున్నారు.


Next Story

Most Viewed