- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం
దిశ, చిన్నశంకరంపేట : మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం అని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని టీ.మాందాపూర్ గ్రామంలో శ్రీ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు పూర్వ కుంభంతో స్వాగతించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మాట్లాడుతూ శ్రీరామచంద్ర భగవాన్ ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. శ్రీ రామచంద్రుని కృపాకటాక్షాలతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో గజగట్లపల్లి ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్ గౌడ్, మాజీ సర్పంచ్ భిక్షపతి, మాజీ ఉప ఉప సర్పంచ్లు మహేందర్, ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాయకులు స్వరూప సురేందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది గణేష్ గౌడ్, బాలయ్య, బస్వరాజ్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.