గ్యారెంటీ ల పేరు తో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
గ్యారెంటీ ల పేరు తో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, మీర్ పేట్: గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ద్వారా ప్రజలంతా బుద్ధి చెప్పాలని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, గాయత్రి నగర్, లెనిన్ నగర్, లో ప్రజా ఆశీర్వాద యాత్ర లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు యావత్ భారతదేశం ఎదురు చూస్తోందన్నారు.

దేశ అభివృద్ధి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి శ్రమిస్తున్న నరేంద్ర మోడీకి చేవెళ్ల ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. దేశ ఐక్యత, ప్రపంచశాంతి కోసం నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీని ఓడించలేక ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని అయినప్పటికీ నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని, ఆయన చిత్తశుద్ధి అంకితభావం కారణంగానే ఇవాళ భారతదేశ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బస్సు యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి, మహేశ్వరం బిజెపి ఇంఛార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలను శంకర్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, బిక్షపతి చారి,బిజెపి ప్రధాన కార్యదర్శి గాజుల మధు, సోమేశ్వర్,బిజెపి నాయకులు రవి నాయక్, శ్రవణ్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed