'జాతిరత్నాలు' డైరెక్టర్‌తో వెంకీ.. రచ్చ చేస్తారంటున్న ఫ్యాన్స్

by Dishafeatures2 |
జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకీ.. రచ్చ చేస్తారంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవి తెరకెక్కించిన 'జాతిరత్నాలు' అభిమానులను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసిందో తెలిసిన విషయమే. కాగా ఈ మూవీ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళ్ హీరో శివకార్తికేయన్‌ ఓ సినిమా చేస్తుండగానే.. మరో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ అనుదీప్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల అనుదీప్ చెప్పిన స్టోరి వెంకీకి నచ్చిందని, ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించాలని చర్చలు కూడా చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక 'ఎఫ్3' రిలీజ్ తర్వాత ఆలస్యం చేయకుండా ఈ సినిమా షూటింగ్‌ వేగం పెంచేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలుబడే అవకాశం ఉంది.


Next Story