- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారత్కు లంకేయుల వలసలు
చెన్నై: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక నుంచి భారత్కు వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం లంక నుంచి 21 మంది శరణార్థులు రామేశ్వరం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రామేశ్వరంలోని ధనుష్కోటి సమీపంలో వీరిని గుర్తించినట్లు చెప్పారు. వీరిని భారత తీర ప్రాంత దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెండు పడవల్లో భారత్కు చేరకున్నట్లు వెల్లడించారు. వీరందరినీ మండపం శరణార్థుల క్యాంపుకు తరలించినట్లు చెప్పారు. లంకలో తీవ్రసంక్షోభం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శరణార్థుల క్యాంపుల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికిగానూ ఇప్పటికే సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వ అధికారులను సిద్ధంగా ఉండమని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్కు ఆయన లేఖ రాశారు. ఇక శ్రీలంకలో సంక్షోభం తర్వాత భారత్ చేరిన శరణార్థుల సంఖ్య 40 దాటింది.