- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో విషాదం.. తండ్రీకొడుకులకు కరెంట్ షాక్..
by S Gopi |
దిశ, గూడూరు: తండ్రీకొడుకులకు కరెంట్ షాక్ తగిలి.. కొడుకు మృతి చెందిన..son died of electric shock, father injured

X
దిశ, గూడూరు: తండ్రీకొడుకులకు కరెంట్ షాక్ తగిలి.. కొడుకు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ శివారులోని హనుమాన్ తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనుమాన్ తండా గ్రామనికి చెందిన అంగోత్ సక్రు, అంగోత్ కిరణ్ తండ్రీకొడుకులు. వ్యవసాయం చేసుకంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజు లాగానే ఇంటి ముందు ఉన్న తీగపై బట్టలు ఆరవేసే క్రమంలో దురదృష్టవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అంగోత్ కిరణ్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని రక్షించే క్రమంలో తండ్రికి కూడా కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వేళ్లడంతో గ్రామస్తులు గమనించి గూడూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. తండ్రి కొడుకులకు కరెంట్ షాక్ తగిలి కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






