స్వరాజ్యాన్ని పరామర్శించిన సంకినేని

by Disha Web Desk 12 |
స్వరాజ్యాన్ని పరామర్శించిన సంకినేని
X

దిశ,తుంగతుర్తి: అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ను శనివారం రాత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పరామర్శించారు.ఆమె ఆరోగ్య పరిస్థితి డాక్టర్ తో పాటు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story