Sanjay Raut: అరెస్ట్ చేసుకోమని ట్వీట్ చేసిన శివసేన ఎంపీ

by Dishanational1 |
Sanjay Raut Replied To ED, Come Arrest me
X

ముంబై: Sanjay Raut Replied To ED, Come Arrest me| మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. మంగళవారం విచారణకు హజరు కావాలని సమన్లు జారీ చేశారు. దీనిపై ఎంపీ రౌత్ స్పందిస్తూ ఇతి తనను ఆపడానికి జరుగుతున్న కుట్ర అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో భారీగా రాజకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. మేము బాలాసాహెబ్ శివసైనికులుగా వీటిపై పోరాడుతున్నాం. ఇది నన్ను అడ్డుకునేందుకు కుట్ర. మీరు నా ముందు వచ్చి ఉన్నప్పటికీ, నేను గువహతి మార్గంలో వెళ్లను. నన్ను అరెస్ట్ చేయండి' అని ట్వీట్ చేశారు. రూ.1,034 కోట్ల పత్రా చౌల్ భూకుంభకోణంలో ఈడీ ఏప్రిల్‌లో సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసింది. అయితే అప్పట్లోనే దీనిపై రౌత్ స్పందిస్తూ తాను ఎవ్వరికీ భయపడనని అన్నారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఈడీ సమన్లనుద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు. ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ కు శుభాకాంక్షలు చెప్పారు. అనర్హతలపై జరిగే కోర్టు పోరులో తిరుగుబాటు వర్గం విజయం సాధిస్తుందని అన్నారు.

Next Story

Most Viewed