ఆటోను ఢీకొన్న కంటైనర్ లారీ

by Disha Web Desk 13 |
ఆటోను ఢీకొన్న కంటైనర్ లారీ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ వద్ద కంటైనర్ లారీ, ఆటో ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలం పోతాయిపల్లి గ్రామంలో సోమవారం బంధువుల అంత్యక్రియలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో కామారెడ్డి వస్తుండగా.. పద్మాజివాడి ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ క్రాసింగ్ అవుతూ ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న సయ్యద్ చోటేమియా అక్కడికక్కడే మృతి చెందాడు. సాజిద్ పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.


గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న సాజిద్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతులు సయ్యద్ చోటేమియా లింగంపేట మండల కేంద్రానికి చెందిన వాసిగా, సాజిద్ ను మేడ్చల్ ప్రాంతానికి చెందిన వాసిగా, ఖైరూన్, గౌస్, అక్తర్ లు మేడ్చల్ ప్రాంత వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed