హోళీ హుషారులో అతివేగం.. ముగ్గురు మృతి

by Disha Web Desk 13 |
హోళీ హుషారులో అతివేగం.. ముగ్గురు మృతి
X

దిశ, కేసముద్రం: మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌ల‌ కేంద్రంలో శుక్ర‌వారం జ‌రుగుతున్న‌ హోలీ సంబ‌రాల్లో విషాదం చోటు చేసుకుంది. కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీకి చెందిన భూక్య తరుణ్(22), అంగోతు న‌ర‌సింహ(38) హోలీ వేడుక‌ల్లో పాల్గొంటూ ద్విచక్ర‌వాహ‌నంపై వేగంగా వెళ్తూ.. అదే గ్రామానికి చెందిన చిదిరాల చందు(22) తన బాబాయ్ కూతురు కావ్య‌తో క‌లిసి బైక్‌పై వ‌స్తుండ‌గా.. ఫ్లై ఓవ‌ర్‌పై ఢీకొట్టారు.


ఈ ఘ‌ట‌న‌లో త‌రుణ్‌, న‌ర‌సింహ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. చందు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో మ‌ర‌ణించాడు. కావ్య‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed