‘దిశ’ కథనానికి స్పందన

by Jakkula.Mamatha |

ప్రయాణికుల సమస్యను పత్రిక కథనం ద్వారా వెలుగులు తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘దిశ’ వెబ్ న్యూస్ కథనానికి స్పందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్‌కు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు తాటిపల్లి సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు.

‘దిశ’ కథనానికి స్పందన
X

దిశ, కొణిజర్ల: ప్రయాణికుల సమస్యను పత్రిక కథనం ద్వారా వెలుగులు తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘దిశ’ వెబ్ న్యూస్ కథనానికి స్పందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్‌కు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు తాటిపల్లి సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 12న ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షణ అనే శీర్షికతో దిశ వెబ్లో కథనం వెలువడింది. వార్తకు స్పందించిన ఆర్ఎం పల్లిపాడు మీదుగా నడిచే అన్ని డిపోల ఎక్స్ ప్రెస్ సర్వీసులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం దించడం చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు అందజేశారు. ఈ మేరకు సుధీర్ మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ‘దిశ’ పత్రిక కృషి మరువలేనిదని ప్రశంసించారు.

Next Story