IPL చరిత్రలో తొలి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్

by Disha Web Desk 12 |
IPL చరిత్రలో తొలి క్రికెటర్‌గా రవిచంద్రన్ అశ్విన్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో రవిచంద్రన్ అశ్విన్ ఓ చరిత్రను సృష్టించాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇలా చేసిన మొదటి ఆటగాడిగా అశ్విన్ పేరు నమోదు చేసుకున్నాడు. LSG పై 23 బంతుల్లో 28 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్ 18.3 ఓవర్‌లో సడన్‌గా మ్యాచ్ నుంచి వెల్లిపోయాడు. దీంతో మైదానంలో ఉన్న ప్రేక్షకుల మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు.

అ తరువాత వచ్చిన రియాన్ పరాగ్ చివరి పది బంతులు అడి టీమ్‌కు మంచి స్కోర్ అందించాడు. అయితే ఏ బ్యాట్స్ మెన్ అయినా అంపైర్ అనుమతి లేకుండా రిటైర్ చేసి, మరల తిరిగి ఆటను ప్రారంభించకపోతే వారిని అంపైర్లు రిటైర్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. మంచి స్కోర్‌తో ఉన్న అశ్విన్ ఇలా వెల్లిపోయి ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే తన టీం విజయానికి కూడా దోహదపడ్డాడు అని చెప్పుకోవాలి.



Next Story