అజిత్‌కు అరుదైన గౌరవం.. వినూత్న ప్రయత్నం చేసిన 'జీ5'

by Disha Web Desk 12 |
అజిత్‌కు అరుదైన గౌరవం.. వినూత్న ప్రయత్నం చేసిన జీ5
X

దిశ, సినిమా: ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జీ5' కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో జనాలకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వలిమై' చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన జీ5 సంస్థ మార్చి 25 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. అలాగే అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం చెన్నైలోని 'వైయమ్‌సీఏ' సర్కిల్‌లో 10వేల అడుగుల ఎత్తైన పోస్టర్‌ను ఏర్పాటు చేసినట్లు జీ యాజమాన్యం తెలుపగా ప్రస్తుతం ఈ పోస్టర్‌ దేశవ్యాప్తంగా టాక్‌ ఆఫ్‌ టౌన్‌గా మారింది. ఇక ఈ మూవీలో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ 'అర్జున్‌' పాత్రలో నటించగా బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురైషీ కీలక పాత్ర పోషించింది. జీ స్టూడియోస్‌‌తో కలిసి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.



Next Story

Most Viewed