'గల్లీ బాయ్' అభిమానులకు షాకింగ్ న్యూస్.. 24 ఏళ్లకే దూరమైన ధర్మేష్

by Disha Web Desk 12 |
గల్లీ బాయ్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. 24 ఏళ్లకే దూరమైన ధర్మేష్
X

దిశ, సినిమా: ప్రముఖ రాపర్ 'గల్లీ బాయ్' ఫేమ్ ధర్మేష్ పర్మార్ హఠాన్మరణం అందరిని షాక్‌కు గురిచేసింది. 'ఎంసీ టాడ్ ఫాడ్' అనే పేరుతో పిలిచే రాపర్ 24 ఏళ్ల వయసులోనే మరణించడం శత్రువులను సైతం కలిచివేస్తుంది. అయితే ఇప్పటి వరకు మరణానికి గల కారణాలు తెలియక పోగా ముంబైలో సన్నిహితులు అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇక ఈ విషాధ ఘటనకు సంబంధించిన వివరాలను అతనితో పార్ట్‌నర్‌గా ఉన్న యూట్యూబ్ చానెల్ 'స్వదేశీ' సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా.. బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్, జోయా అక్తర్, సిద్ధార్థ్ చతుర్వేది భావోద్వేగ నివాళి అర్పిస్తున్నారు. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన 'గల్లీ బాయ్' లోని 'ఇండియా 91' పాటకు ర్యాప్ వెర్షన్‌ను సృష్టించి అభిమానులను ఉర్రూతలూగించిన ధర్మేష్ ఈ ఒక్క సాంగ్‌తో చాలా ఫేమస్ అయ్యాడు.

Next Story

Most Viewed