తెలంగాణ ప్రజలు అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

by Dishanational2 |
తెలంగాణ ప్రజలు అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత కాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో రానున్న రెడు మూడు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం (ఈరోజు) రంగారెడ్డి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.


Next Story

Most Viewed