భద్రాచలం నుంచి ముంబైకి తరలింపు.. మధ్యలో అడ్డగించిన రాచకొండ పోలీసులు

by Disha Web Desk |
భద్రాచలం నుంచి ముంబైకి తరలింపు.. మధ్యలో అడ్డగించిన రాచకొండ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో గంజాయి వినియోగాన్ని నిర్మూలించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బుధవారం గంజాయి నిర్మూలనలో భాగంగా రాచకొండ కమిషరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భద్రాచలం నుంచి ముంబై నగరానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారినుంచి గంజాయితో పాటు రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరించారు.



Next Story