విషాదం మిగిల్చిన 'అప్పు'.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

by Dishanational1 |
విషాదం మిగిల్చిన అప్పు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..
X

చెన్నై: అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. భార్యాపిల్లలను హత్య చేసి.. ఆపై భర్త కూడా ఉరేసుకురి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరికి చెందిన తైయాగ్ రాజన్ ఎలక్ట్రిషియన్. ఇతడికి భార్యా ఇద్దరు పిల్లలు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజన్ ఉదయం ఎలక్ట్రిషిన్‌గా, రాత్రుళ్లు ఆటో డ్రైవర్‌గా పని చేసే వాడు. అప్పుల విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గురువారం కూడా గొడవ జరగడంతో రాజన్ భార్యాపిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story

Most Viewed