- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగాం గ్రామంలో సర్వే నంబర్-218 లో గల 32 ఎకరాల భూమిని దళితులకు పంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసుకుని నిరసన చేపట్టారు. భూమి రాని దళితులకు అక్కడ భూమిని కేటాయించాలి. కానీ దళితులు అయినా మాకు కాకుండా కొంతమంది ధనవంతులు, పలుకుబడిన వారు ఆ భూములను కబ్జా చేస్తున్నారన్నారు. 32 ఎకరాల భూముల్లో అక్రమ సాగుదారులు వెళ్లగొట్టి, ప్రభుత్వం మిగులు భూమిగా గుర్తించి పేద దళితులకి ఆ భూమిని అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఈ పోరాటం కొనసాగుతుందని భూములు మాకు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
Next Story






