విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం : చైర్‌పర్సన్ ఉమారాణి

by Batti.Sumithra |

కామారెడ్డి మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ వాల్ ఆపరేటర్ శ్యామల శ్రీనివాస్ పాము కాటుకు గురయ్యారు.

విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం : చైర్‌పర్సన్ ఉమారాణి
X

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ వాల్ ఆపరేటర్ శ్యామల శ్రీనివాస్ పాము కాటుకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మున్సిపాలిటీ తరఫున అన్ని సహాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ సిబ్బంది సంక్షేమమే తమ ప్రాధాన్యమని, శ్యామల శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని చైర్‌పర్సన్ ఆకాంక్షించారు.

Next Story