రాధేశ్యామ్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌.. దారుణానికి ఒడిగట్టిన ప్రభాస్ అభిమాని

by Disha Web Desk 2 |
రాధేశ్యామ్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌.. దారుణానికి ఒడిగట్టిన ప్రభాస్ అభిమాని
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ‌కు, విధిరాతకు మ‌ధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రాధాకృష్ణ కుమార్‌ ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. అయితే, సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రం ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు మిక్స్‌డ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చిందని ప్రభాస్‌ అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

కర్నూలు తిలక్ నగర్‌లో నివాసముంటూ.. వెల్డింగ్ చేసుకుంటూ జీవనం సాగించే రవితేజ (24) సినిమా బాగా లేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం విడుదల రోజు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా పోయివచ్చిన తర్వత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి ఎంత ఫోన్ చేసినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి అతని స్నేహితులకు చెప్పింది. ఉదయం స్నేహితులు ఇంటి తలుపులు తెరిచి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ప్రభాస్ సినిమా బాగా లేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్ఐ రామయ్య తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన​ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు.


కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేనా..?...............మీ అభిప్రాయం తెలపడానికి క్లిక్ చేయండి

Next Story